TPCC Chief Mahesh Kumar Goud On CLP Meeting : స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దాదాపు ఐదున్నర గంటల పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం(ఎంసీఆర్హెఆర్డీ)లో జరిగిన సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ సహా రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.