ఈ నెలలో రెండు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తాం - టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్

2025-02-06 5

TPCC Chief Mahesh Kumar Goud On CLP Meeting : స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దాదాపు ఐదున్నర గంటల పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం(ఎంసీఆర్​హెఆర్డీ)లో జరిగిన సమావేశానికి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దీపాదాస్‌ మున్షీ సహా రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.