IPS PV Sunil Kumar Issue in AP : సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్కుమార్ను విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రఘురామకృష్ణరాజు కేసులో ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఆయన పోస్ట్ పెట్టారు. ఈ వ్యవహారంపై ఆయణ్ని విచారించాలని నిర్ణయించిన సర్కార్ విచారణాధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సిసోదియాను నియమించింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ హరీశ్గుప్తా ఈ కేసును విచారణాధికారి ముందు ప్రజంట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.