Lokesh on IT Development in AP : విశాఖపట్నంలో ఐటీ అభివృద్ధిపై శాసనసభ్యుల ప్రశ్నలకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సమాధానం ఇచ్చారు. ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని అనే నినాదం కూటమి ప్రభుత్వానిదని లోకేశ్ స్పష్టం చేశారు. ఏపీలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు తేవడమే తన టార్గెట్ అని చెప్పారు. అదే సమయంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా ప్రణాళికలు చేస్తున్నామని వెల్లడించారు. విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దుతామని గతంలోనే హామీ ఇచ్చామని గుర్తుచేశారు. దాని కోసమే డేటా సెంటర్ పాలసీని కూడా రూపకల్పన చేశామని ఆయన వివరించారు.