CM Chandrababu on Polavaram Project: ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 2027లోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తామనే ప్రచారంలో వాస్తవం లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు. నిధుల విడుదల విషయంలో కేంద్రం కూడా సుముఖంగా ఉందని, నిపుణులు, సాంకేతిక సిబ్బంది సూచనలు, సలహాలతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. 2026 మార్చిలోపు కొత్త డయాఫ్రమ్ వాల్ పూర్తవుతుందని తెలిపారు.