Minister Ponguleti Comments On State Capital : భద్రకాళి అమ్మవారి దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లాలోని భద్రకాళి అమ్మవారిని నేడు దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి వచ్చిన మంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న మంత్రి శ్రీనివాస్ రెడ్డి, మాడవీధుల అభివృద్ధి పనులపై కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.