Panuganti Chaitanya To CID Custody in Case Of Attack On TDP Office : మనం అభిమానించే జగన్ను టీడీపీ నాయకులు దూషిస్తే సైలెంట్గా ఉంటావేంటని వైఎస్సార్సీపీ కీలక నేతలు తనను రెచ్చగొట్టి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి పంపారని కేసులో ప్రధాన నిందితుడు పానుగంటి చైతన్య సీఐడీ విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. మూడు రోజుల కస్టడీలో పలు అంశాలపై అధికారులు చైతన్యను ప్రశ్నించగా గుర్తు లేదు, మరిచిపోయానని బదులిచ్చినట్లు సమాచారం. విచారణకు చైతన్య సహకరించని విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని సీఐడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.