Special Package for Flood Victims: విజయవాడ సహా ఇటీవల వర్షాలు, వరదలకు నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. సర్వం కోల్పోయిన బాధితులు మళ్లీ నిలదొక్కుకునేలా ఊతమిచ్చింది. క్షేత్రస్థాయిలో నష్టం అంచనాలపై మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికలను పరిగణలోకి తీసుకున్న సీఎం చంద్రబాబు పరిహారం వివరాలను ప్రకటించారు.