రూ. 15 వేల కోట్లు అప్పా? లేక గ్రాంటా? - స్పష్టత

2024-07-23 977

Nirmala Sitharaman on Budget 2024 for AP: రాష్ట్రం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మరోసారి తెలిపారు. పోలవరానికి ఎంత ఖర్చయినా.. ఎలా తెచ్చినా కేంద్రానిదే బాధ్యతని, కేంద్రం అంగీకరించిన మేరకు అన్ని నిధులు అందించి తీరుతామని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం పూర్తిగా కట్టుబడి ఉందని తెలిపారు.