ప్రాజెక్టులకు జలకళ - భద్రాచలం వద్ద 26 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

2024-07-19 10

Telangana Irrigation Projects Are Heavy Flood : తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గురువారం 20 అడుగులు ఉన్న నీటిమట్టం ప్రస్తుతం 26 అడుగులకు చేరుకుంది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు భారీ వరద చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1065.7 అడుగులుగా ఉంది.

Free Traffic Exchange