CM Revanth Chit Chat in Delhi : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు ఉచ్చులో చిక్కుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ బతకడం, కేసీఆర్ నిలదొక్కుకోవడం ఇక జరగదని స్పష్టం చేశారు. దిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి, కేసీఆర్ విధానాలను బట్టే రాష్ట్ర రాజకీయాలు ఉంటాయని అన్నారు. జగన్ మోహన్ రెడ్డిని చూశాక నేర్చుకోవాలన్నారు. హైదరాబాద్కు అమరావతి పోటీ కాదని, రాష్ట్ర ప్రగతిలో ప్రాంతీయ రింగు రోడ్డు కీలక భూమిక పోషిస్తుందన్నారు.