Presidential Election:BJP And Opposition Parties To conduct Crucial Meets For presidential candidate Pick |
విపక్షాల తరఫున రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే ఉమ్మడి అభ్యర్ధి విషయంలోనూ చిక్కులు తప్పడం లేదు. ఇప్పటికే శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, గోపాలకృష్ణగాంధీ రూపంలో ముగ్గురు నేతలు విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా పోటీలో ఉండేందుకు ససేమిరా అనేశారు. ఇప్పుడు మాజీ కేంద్రమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఉన్న యశ్వంత్ సిన్హాను దీదీ మమతా బెనర్జీ తెరపైకి తెచ్చారు. గతంలో వాజ్ పేయికి సన్నహితుడిగా పేరు తెచ్చుకున్న యశ్వంత్ సిన్హాను తెరపైకి తీసుకురావడం ద్వారా ఎన్డీయేను ఇరుకునపెట్టాలని మమత భావిస్తున్నారు. యశ్వంత్ పేరును ఏకాభిప్రాయం ద్వారా ప్రకటించేందుకు ఇవాళ విపక్షాలు భేటీ అవుతున్నాయి.
#Presidentialelection
#BJP
#YashwantSinha