Team India :7 captains changed in the last one year For Indian team | కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో టీమిండియా పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఎంతలా అంటే ఒకే ఏడాదిలో జట్టుకు ఏడుగురు సారథ్యం వహించారు. ఒకే సమయంలో రెండు పర్యటనలకు వెళ్లడం, సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడం.. గాయపడటం వంటి పరిస్థితుల కారణంగా ఈ గతి పట్టింది. గత 11 నెలల కాలంలో విరాట్ కోహ్లీ నుంచి శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, అజింక్యా రహానే, రిషభ్ పంత్, హార్ధిక్ పాండ్యాలతో మొత్తం ఏడుగురు జట్టుకు సారథ్యం వహించే అవకాశం దక్కించుకోవడం విశేషం.
#teamindia
#viratkohli
#TeamIndiaCaptaincy