విశాఖ: గుర్రంపై గిరిజన ప్రాంతాలను సందర్శించిన ఐఏఎస్ అధికారి

2022-03-25 2

విశాఖ జిల్లా పెదబయలు మండలం మారుమూల ఏవోబీ ప్రాంతాలైన జామి గూడా, గుంజి వడా, భుసిపుట్టు గ్రామాలను ఐటీడీఏ పీఓ రొణంకి గోపాలక్రిష్ణ సందర్శించారు. మారుమూల ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్లు, ఉపాధి హామీ పథకం, గిరిజనుల సమస్యలు తెలుసుకోవడానికి వాహనాలు వెళ్లలేని ప్రాంతాల్లో గుర్రంపై వెళ్లి పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలను ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో అక్కడి ప్రజలను అడిగి తెలుసుకున్నారు.