PM Modi Telugu Tweet To Appreciate Chiranjeevi & Nagarjuna And Tollywood

2020-04-04 310

Narendra Modi Telugu Tweet to Appreciate Chiranjeevi And Nagarjuna For Making Awareness On Lockdown. PM Thanked Chiranjeevi, Nagaruna, Varun Tej And Sai Dharam Tej On Special Song On present situation.
#PMModiTeluguTweet
#ModiAppreciateChiranjeevi
#Nagarjuna
#Tollywood
#modilikestelugusong
కరోనాపై అవగాహన కలిగించేందుకు సినీ ప్రముఖులు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు.పాటల రూపంలో కరోనాపై అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో కోటీ, కీరవాణి, వందేమాతరం శ్రీనివాస్, ఆర్జీవీ వంటి వారు తమ కలానికి పదును పెట్టి కరోనాపై గురి పెట్టారు. ఈ నేపథ్యంలో కోటి స్వరపరిచిన గీతంలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ నటించారు. అందరికీ ఓ చక్కటి సందేశాన్ని ఇచ్చారు.ఈ పాటను ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చుకున్నారు. కరోనాపై అవగాహన కలిగించేందుకు చేసిన ప్రయాత్నాన్ని ప్రశంసించారు. ‘చిరంజీవిగారికీ, నాగార్జునగారికీ, వరుణ్ తేజ్ కీ, సాయి ధరమ్ తేజ్ కీ మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు. అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం. అందరం సామాజిక దూరం పాటిద్దాం. కరోనా వైరస్ పై విజయం సాధిద్దామ'ని ట్వీట్ చేశారు.