బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావుపై బూటుతో దాడి

2019-04-18 572

WATCH Delhi Shoe hurled at BJP MP GVL Narasimha Rao during a press conferen

బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావుపై బూటు దాడి చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఆయనపై బూటు విసిరాడు. దేశ రాజధానిలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన సంభవించింది. కాంగ్రెస్ సానుభూతిపరుడే తనపై దాడి చేసి ఉంటాడని జీవీఎల్ ఆరోపించారు. రెండో దశ పోలింగ్ సందర్భంగా గురువారం మధ్యాహ్నం జీవీఎల్ నరసింహా రావు పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ సీనియర్ నేత భూపేంద్ర యాదవ్ తో కలిసి పోలింగ్ సరళి మీద ఆయన మాట్లాడారు.