Lok Sabha Elections 2019 : చేతి గుర్తుకు ఓటు వేస్తే... కారుకు పడుతోందని కోమటిరెడ్డి ఆగ్రహం..!!

2019-04-11 1

Congress Party leader Komatireddy Venkat Reddy on Thursday fired at EVM malfunction. He said that EVMs malfunction in many places in Bhongir
#loksabhaelections2019
#komatireddyvenkatreddy
#kalvakuntlakavitha
#telangana
#vote
#voter
#evm
#electioncommission

సార్వత్రిక ఎన్నికల్లో ఒక పార్టీకి ఓటు వేస్తుంటే మరో పార్టీకి పడుతోందని ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఈ పరిస్థితి చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఏపీలో చాలా పోలింగ్ బూత్‌లలో టీడీపీ సింబల్ సైకిల్ గుర్తుకు ఓటు వేస్తుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫ్యాన్ గుర్తుకు పడుతోందని ఎంతోమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోను కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది.కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తుంటే అధికార టీఆర్ఎస్ పార్టీకి ఓటు పడుతోందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చేతి గుర్తుకు ఓటు వేస్తుంటే కారు గుర్తుకు పడుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. భువనగిరి లోకసభ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకట రెడ్డి పోటీ చేస్తున్నారు. తాజాగా, ఆయన కూడా ఆరోపణలు చేశారు.

Free Traffic Exchange