సామాన్య మహిళలకే కాదు, ప్రముఖులైన మహిళలకు కూడా వేధింపులు తప్పడం లేదు. జాతీయస్థాయి క్రీడాకారిణి రుచికా జైన్ తన భర్త వేధింపులు భరించలేక మీడియా ముందుకు వచ్చారు. పెళ్లికి ముందే మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకొని తనను మానసిక వేధింపులకు గురిచేస్తున్న భర్త అక్షయ్ కఠారియాను కఠినంగా శిక్షించాలని వెస్ట్మారేడుపల్లికి చెందిన జాతీయస్థాయి రోలర్ స్కేటింగ్ క్రీడాకారిణి రుచికా జైన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం స్వగృహంలో కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి ఆమె మీడియాతో మాట్లాడారు.
పెద్దలు కుదిర్చిన సంబంధం, మంచి అబ్బాయి అని చెప్పడంతో అక్షయ్ కఠారియా(24)తో 2017 డిసెంబర్ 11న వివాహం జరిగిందని వివరించారు. ఇష్టానుసారంగా ఇంటికి వస్తుండటంతో అదేమని అడిగితే తన స్నేహితుల ఇళ్లకు వెళ్తున్నట్లు బుకాయించేవాడని తెలిపారు. అంతేగాక, తన పేరుతో సెల్ఫోన్లో ఓ అమ్మాయితో ఛాటింగ్ చేయడంతో వివాహేతర సంబంధం బయటపడిందని తెలిపారు.
కుటుంబ సభ్యుల వత్తిడితో తనను వివాహం చేసుకొని మోసం చేశాడని, జూన్ 20న బేగంపేట మహిళా పీఎస్లో అక్షయ్కఠారియా, అతడి కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేయగా కేసు నమోదైనట్లు తెలిపారు.