Nava Nirmana Deeksha 2018 : Chandrababu Naidu Speech

2018-06-02 4,356

Nava Nirmana Deeksha 2018 : Chandrababu Naidu Speech

జూన్ 2 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చీకటి రోజని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర విభజనతో ఏపీకి అన్యాయం జరిగిందని అన్నారు. రెండు జాతీయ పార్టీలు ఏపీకి తీరని ద్రోహం చేశామని మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ నేపథ్యంలో విజయవాడ వేదికగా శనివారం నవ నిర్మాణ దీక్ష చేపట్టారు. సీఎం చంద్రబాబునాయుడు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, కొందరు మంత్రులు, ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధికి ప్రజలను పునరంకితం చేసేలా గత నాలుగేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఈ దీక్షను చేపడుతూ వస్తున్న విషయం తెలిసిందే.