రంగస్థలం రికార్డు స్థాయి బిజినెస్ తో పెరిగిన హైప్

2018-03-12 881

Director Sukumar took the opportunity to take the audience back to the 80s with Rangasthalam 1985. This film features Ram Charan, Samantha Akkineni, Aadhi Pinisetty, Anasuya Bharadwaj and Jagapati Babu in the lead. In Nizam and Ceded regions, the rights have been for approximately Rs. 30 crores. This shows the demand graph of the film.

టాలీవుడ్ చిత్ర పరిశ్రమ దృష్టంతా ప్రస్తుతం రంగస్థలం చిత్రం మీదే ఉంది. మెగా పవర్‌స్టార్ రాంచరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. రంగస్థలం చేస్తున్న ప్రీ రిలీజ్ బిజినెస్ ట్రేడ్ వర్గాలకు ముచ్చెటమలు పట్టిస్తున్నాయి. సీడెడ్‌లో ఈ చిత్రం అనూహ్యమైన బిజినెస్ చేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
దర్శకుడు సుకుమార్ రూపొందించిన చిత్రాలను, రాంచరణ్ నటించిన సినిమా బిజినెస్‌లను పోల్చుకొంటే రంగస్థలం చిత్రం భారీస్థాయిలో వ్యాపారం చేస్తున్నది. మిగితా ఏరియాలో కూడా రికార్డు స్థాయి బిజినెస్ జరుగుతున్నట్టు సమాచారం. ట్రేడ్ అనలిస్తుల రిపోర్టు ప్రకారం.. రంగస్థలం సినిమా సీడెడ్ థియేట్రికల్ హక్కులను ప్రముఖ పంపిణీదారుడు రూ.12.1 కోట్లకు దక్కించుకొన్నట్టు సమాచారం. దాంతో ఈ సినిమాపై మరింత హైప్ పెరిగింది. బాహుబలిని పక్కన పెడితే పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన కాటమరాయుడు చిత్రం రూ.11.7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఆ సినిమాను మినహాయించి మిగిత చిత్రాల బిజినెస్‌ను పరిశీలిస్తే ఏ సినిమా కూడా రూ.10 కోట్లకు మించి బిజినెస్ చేయలేదనేది ట్రేడ్ వర్గాల సమాచారం.

Free Traffic Exchange